Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులు కేంద్రం మెడలు వంచి చరిత్ర సృష్టంచారు : సీఎం స్టాలిన్

రైతులు కేంద్రం మెడలు వంచి చరిత్ర సృష్టంచారు : సీఎం స్టాలిన్
, శుక్రవారం, 19 నవంబరు 2021 (14:53 IST)
రైతులకు హానిచేసేలా కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దీనిపై డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రైతులు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గుర్తించాలని ఆయన కోరారు. రైతులు ఏమాత్రం వెనకంజ వేయకుండా, పట్టువదలకుండా పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి ఒక చరిత్ర సృష్టించారని సీఎం స్టాలిన్ అన్నారు. 
 
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, ఇది శుభపరిణామని చెప్పారు. 
 
ఇదే అంశంపై కాంగ్రెస్ పూర్వాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందిస్తూ, "అన్నదాతలు వారి సత్యాగ్రంతో అహంకారం తలదించేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించి రైతులందరికీ శుభాకాంక్షలు. ఇది కేంద్ర ప్రభుత్వపు అహంకార ఓటమి, రైతుల విజయం" అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నవారి కంటే అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తిమంతమైనది అంటూ ట్వీట్ చేశారు. అలుపులేని పోరాటంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుని, భారత రైతులంటే ఏంటో నిరూపించారని వ్యాఖ్యానించారు. జై కిసాన్ - జై జవాన్ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూఫీ సద్గురువు, నిత్యాన్న‌దాత అతావుల్లా బాబా అస్తమయం