Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 యేళ్ళ బాలికపై 76 యేళ్ల వృద్ధ పారిశ్రామికవేత్త అత్యాచారం

16 యేళ్ళ బాలికపై 76 యేళ్ల వృద్ధ పారిశ్రామికవేత్త అత్యాచారం
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:38 IST)
కామాంధుల ఆగడాలకు హద్దేలేకుండా పోతోంది. తాజాగా ఓ ముక్కుపచ్చలారని బాలిక బలైపోయింది. 16 యేళ్ళ బాలిక 76 యేళ్ల వృద్ధ పారిశ్రామికవేత్త చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని ఆత్తూరుకు సమీపంలో ఉన్న ఉడయార్ పాళెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉడయార్ పాళెంకు చెందిన నటరాజ్ (76) అనే వ్యక్తి ధనవంతుడు. పైగా, స్థానికంగా ఓ పారిశ్రామికవేత్త. ఆయన ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన 35 యేళ్ల మహిళ వంటపని చేస్తోంది. ఈమెకు తోడుగా 16 యేళ్ళ వయస్సున్న మేనకోడలు వరుస అయిన ఓ బాలిక పని చేస్తోంది. 
 
ఈ బాలికపై కన్నేసిన నటరాజన్... ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. ఈ విధంగా పలుమార్లు తన లైంగిక కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. అయితే, ఇటీవల ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆ బాలికను పరీక్షించిన వైద్యులు... పలుమార్లు అత్యాచారానికి గురైనట్టు తేల్చారు. దీంతో బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధ పారిశ్రామికవేత్తను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డు.. స్విమ్ సూట్.. బైకుపై కూర్చుని..తొడలకు వాక్సింగ్ (video)