Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న సినీనటి గౌతమి

Advertiesment
Gautami

సెల్వి

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (22:36 IST)
Gautami
బీజేపీని వీడిన సినీనటి గౌతమి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గౌతమి 1988లో రజనీకాంత్ నటించిన గురు శిష్యన్ సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ 90వ దశకంలో దక్షిణ భారత నటీమణుల్లో ఒకరిగా వెలుగొందారు.
 
ఈ క్రమంలో గౌతమి 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం గౌతమి చేసిన ప్రచారాలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి.
 
కుమార్తె పుట్టిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న ఆమె 2017లో మళ్లీ బీజేపీలో చేరారు. 2021లో రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. నటి గౌతమి గత అక్టోబర్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
25 ఏళ్లుగా పార్టీకి విధేయురాలిగా ఉన్నా తనకు తగిన గుర్తింపు రాలేదని నటి గౌతమి ఆరోపించారు. ఈ నేపథ్యంలో నటి గౌతమి ఎడప్పాడి బుధవారం పళనిస్వామి సమక్షంలో ఏఐఏడీఎంకేలో చేరారు. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్‌లోని ఆయన  నివాసంలో ఎడప్పాడి పళనిస్వామిని కలిసిన తర్వాత నటి గౌతమి అన్నాడీఎంకేలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలిఫోర్నియాలో కవల పిల్లలతో పాటు దంపతుల మృతి.. ఏమైంది?