సుప్రీంకోర్టు ఘోర తప్పిదం చేసింది... మార్కండేయ ఖట్జూ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి కింది కోర్టులు ఖరారు చేసిన మరణశిక్షను రద్దు చేయడంపై ఆయన స్పందించారు.
'సౌమ్యను అత్యాచారం చేసి చంపేసిన నిందితుడి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చి సర్వోన్నత న్యాయస్థానం ఘోరమైన తప్పిదం చేసింది. ఐపీసీ సెక్షన-300ను సుప్రీం పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన అంశం. కీలకమైన సెక్షనను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోలేదు. కేవలం అందులోని ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.