Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ : సుప్రీంకోర్టు వెల్లడి

పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ : సుప్రీంకోర్టు వెల్లడి
, బుధవారం, 27 అక్టోబరు 2021 (13:20 IST)
దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది.
 
దేశంలో చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దేశ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించజాలదని స్ప‌ష్టంచేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని వ్యాఖ్యానించింది. అదేసమయంలో దేశంలో టెక్నాల‌జీ దుర్వినియోగంపై పరిశీలన చేస్తామని పేర్కొంది. 
 
కాగా, సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పెగాస‌స్‌పై వాదనలను విన్న తర్వాత సెప్టెంబరు 13న తీర్పును వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప్ర‌ముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలంటూ పలు వ్యాజ్యాలు దాఖలు కాగా వీటిపై సుప్రీంకోర్టు విచార‌ణ కొన‌సాగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదు ఓయో రూమ్‌లో ప్రియురాలి గొంతులో కత్తి, దింపింది ఎవరు?