Publish Date: Sat, 04 Apr 2020 (16:31 IST)
Updated Date: Sat, 04 Apr 2020 (16:32 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పలువురు కళాకారులు తమదైన శైలిలో తోడ్పానందిస్తున్నారు.
తమ కళల ద్వారా ప్రజల్ని చైతన్యమంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలను రూపొందించారు.
‘మీతో మేం ఉన్నాం.. మీరు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’’ అని వైద్యులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసే సందేశంతో ఈ చిత్రాలను రూపొందించారు.
లాక్డౌన్ సందర్భంగా వారికి ప్రజలంతా సహకరించాలని సుదర్శన్ పట్నాయక్ కోరారు.