Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్లిసిటీ పిచ్చికి జరిమానా...

Advertiesment
Sub inspector
, బుధవారం, 13 మే 2020 (16:35 IST)
పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అనేది పాత సామెత అయితే... హీరోలను చూసి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అనేది కొత్త సామెత. మరి అలాంటి యువతలో తాను ఒక్కడిని అనుకున్నాడో ఏమో కానీ ఆయన చేసిన పనికి ఉన్నతాధికారుల మందలింపుతో పాటు జరిమానా కూడా కట్టుకోవాల్సి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... తమిళం నుండి తెలుగుకి డబ్బింగ్ అయి తెలుగునాట కూడా కలెక్షన్‌ల వర్షం కురిపించిన సింగం సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ రెండు కార్లపై నిలబడి ప్రయాణించే సీన్ ఒకటి ఉంది. దీని నుండి ప్రేరణ పొందిన దామెహ్ జిల్లాలోని నార్సింగ్‌గర్‌లో ఎస్సైగా పని చేస్తున్న మనోజ్ యాదవ్ కూడా ఇదే తరహాలో ఒక వీడియో చేసారు. 
 
అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయి పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక పోలీసు అధికారి ఇలా చేయడంపై జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ సదరు మనోజ్ యాదవ్‌ని మందలించడంతో పాటు జరిమానాని కూడా విధించారు.
 
ఇప్పటికే పబ్లిసిటీ కోసం వివిధ విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతకు కూడా ఈ విధమైన జరిమానాలు విధిస్తే... వారి పద్ధతి కూడా మారుతుందేమో మరి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏటీఎం యంత్రంలో బుసలు కొడుతున్న పాము... ఎక్కడ?