Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం: 11మంది మృతి

Advertiesment
fire
, మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:08 IST)
తమిళనాడులో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విరుదు నగర్ జిల్లా, శివకాశీ తాలూకా, రెంగపాలయం గ్రామంలో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 
 
గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాను తయారు చేసి, నిల్వ చేశారు. అనుకోకుండా, ఒక ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. 
 
దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలడం ప్రారంభమైంది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగాయి. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసాజ్ చేయించుకుంటూ మీటింగ్‌కు హాజరైన ఎయిర్‌ఏషియా సీఈవో - నెటిజిన్స్ ఫైర్