Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా..

sheetal shinday
, బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:10 IST)
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఓ మహిళ.. ఏకంగా బ్యాంకు మేనేజరు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆర్టీసీ బస్సు డ్రైవరుగా చేరింది. ఆ మహిళ పేరు శీతల్ షిండే. గత 2014లో నుంచి పూణెలోని యాక్సిస్ బ్యాంకులో మేనేజరుగా నాలుగేళ్లపాటు పని చేశారు. ఆ తర్వాత ఆమె ఆర్టీసీ బస్సు డ్రైవరుగా మారేందుకు నిర్ణయించుకున్నారు.
 
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచి జీతం, ఏసీ గదులు ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం యేడాదిన్నరపాటు శిక్షణ తీసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీలో చేరానని చెబుతున్నారు. 
 
కాగా, మహారాష్ట్రలో ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికీ ఉన్నప్పటికీ 2019 మార్చిలో మరోమారు మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. మధ్యలో కరోనాతో విరామం రాగా, చివరకు 17 మంది మగిలాలు. వీరిలో శీతల్ షిండే ఒకరు. మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్టీసీ తొలి బ్యాచ్ మహిళా డ్రైవరుగా ఆమె విధుల్లో చేరనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 యేళ్ళ బాలికపై మేనమామ అత్యాచారం.. ఆపై.. నోట్లో యాసిడ్ పోసి..