Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌కు శరద్ పవార్ ఝలక్!

కాంగ్రెస్‌కు శరద్ పవార్ ఝలక్!
, గురువారం, 17 జూన్ 2021 (23:10 IST)
శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన కలిసి పోటీలోకి దిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతమే. ప్రస్తుతం మహా వికాస్ అగాఢీ పేరుతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను విడిపించుకోవాలన్న మూడ్‌లో ఎన్సీపీ, శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలని అనుకుంటోంది. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయి. ఈ విషయమై శరద్ పవార్, ఉద్ధవ్ ఇప్పటికే మాట్లాడేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాం’’ అని సామ్నా లో శివసేన పేర్కొంది.

2024 సార్వత్రిక ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని,అయినా ఇప్పుడే అన్ని పార్టీలూ ఎన్నికల గురించి మాట్లాడేస్తున్నాయని అభిప్రాయపడింది. దీనిని బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలను తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోందని శివసేన పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు