Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ పుష్పకు ఊరట.. 14వ తేదీ వరకూ అరెస్ట్ వద్దు...

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక

శశికళ పుష్పకు ఊరట.. 14వ తేదీ వరకూ అరెస్ట్ వద్దు...
, బుధవారం, 14 జూన్ 2017 (11:45 IST)
అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక్కి తీసుకోవాలంటూ శశికళతో ఆమె కుటుంబ సభ్యులు సైతం తనను బెదిరించారని పోలీసులకు, డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. 
 
దీంతో శశికళ పుష్పతో పాటు ఆమె భర్త తిలకన్, తల్లి గౌరీలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాము అరెస్ట్ కాకుండా ఉండేందుకు మధురై హైకోర్టు బెంచ్‌లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ నెల 14వ తేదీ వరకు వీరిని అరెస్ట్ చేయకూడదంటూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14న జరుగుతుందని కోర్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయంలో బాలుడి కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు..