Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆలయంలో బాలుడి కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు..

శ్రీవారి ఆలయంలో నేరాలు అధికమైపోతున్నాయి. తిరుమల వెంకన్న ఆలయంలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ జంట ఆదమరిచి నిద్రిస్తుండగా వారి కుమారుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చ

శ్రీవారి ఆలయంలో బాలుడి కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు..
, బుధవారం, 14 జూన్ 2017 (11:00 IST)
శ్రీవారి ఆలయంలో నేరాలు అధికమైపోతున్నాయి. తిరుమల వెంకన్న ఆలయంలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ జంట ఆదమరిచి నిద్రిస్తుండగా వారి కుమారుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ దంపుతులు మంగళవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. మంగళవారం రాత్రి కావడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండంపం దగ్గర తమ కుమారుడు(1) చెన్నకేశవులుతో కలిసి నిద్రించారు. దంపతులిద్దరూ గాఢనిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లిపోయాడు.
 
ఈ విషయం తెలిసి బాలుడి తల్లి బోరున విలపించింది. ఈ ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విచారణలో భాగంగా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు నిందితుడి దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు