Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బావిలో నీరెత్తెందుకు వెళ్లిన భార్యను దూషించాడు.. అంతే ఇనుపరాడ్లతో దాడి చేశాడు..

భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక భాగంలో ఇనుపరాడ్లతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా

బావిలో నీరెత్తెందుకు వెళ్లిన భార్యను దూషించాడు.. అంతే ఇనుపరాడ్లతో దాడి చేశాడు..
, మంగళవారం, 27 జూన్ 2017 (17:23 IST)
భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక భాగంలో ఇనుపరాడ్లతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదిర్ వేల్ (38) భార్యతో సెల్ ఫోన్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
 
వాళప్పాడి, ముత్తంపట్టికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఓ వ్యక్తి (బాలమణికండన్)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని వద్ద జరిపిన విచారణలో నీటి సమస్యే ఈ దాడికి కారణమని తేలింది.
 
బాలమణికండన్‌ భార్య బావిలో నీరు తోడుకుని ఇంటికి వెళ్తుండగా.. కదిర్ వేల్ ఆమెను దూషించాడని.. ఎందుకిలా చేశావని బాలమణికండన్‌ ఇంటికెళ్లి మందలించినా కదిర్ వేల్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. భార్య పట్ల అమర్యాదపూర్వకంగా నడుచుకుని.. నోటికొచ్చినట్లు వాగిన కదిర్‌వేల్‌పై బాలమణికండన్‌ ఈ కారణంతోనే దాడికి ఒడిగట్టినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్