Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.1720 కోట్ల వంతెన కూలిపోయింది... గంగలో కలిసిపోయింది..

Bihar
, సోమవారం, 5 జూన్ 2023 (11:01 IST)
Bihar
బీహార్‌లో రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్, ఖగారియా రెండు జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
ఈ వంతెనను 2014లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.1710 కోట్లతో 100 అడుగుల ఎత్తులో మూడు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 
 
గత ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన రెండోసారి కూలిపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రైం టీవీ షోలు అంటే పిచ్చి.. కుతూహలం పట్టలేక హత్య చేసిన యువతి