Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2వేలు ఫైన్‌

ఢిల్లీలో మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2వేలు ఫైన్‌
, శుక్రవారం, 20 నవంబరు 2020 (08:43 IST)
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కట్టడి చర్యలు ప్రారంభించారు. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర సమయాల్లో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో రాజకీయాలు తగదని హితవు పలికినట్లు చెప్పారు.

బ్రతికుంటే జీవితమంతా రాజకీయాలు చేయవచ్చునని, కాని ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షించేందుకు పాటు పడాలని సూచించానని కేజ్రీవాల్‌ తెలిపారు. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో ఫైన్‌ రూ.500 ఉండగా దాన్ని ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచారు. కాగా, పండుగలపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదని స్పష్టం చేశారు. నదీ స్నానాలకు ఎక్కువ మంది హాజరుకావడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

పండుగలన్నీ ఇళ్లల్లోనే ఉండి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛట్‌ పూజను జాగ్రత్తగా జరుపుకోవాలని, 200 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. గుంపులో ఒక్కరికి కరోనా సోకినా..మిగిలిన వారికి సోకే అవకాశాలున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌: సీరం సంస్థ