Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోద

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:42 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా రేణుకా చౌదరి వార్తల్లోకెక్కారు.
 
ఈసారి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు అమ్మారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు అమ్మి రూ.5లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రేణుకా చౌదరి మొక్కజొన్నలను అమ్మారు. 
 
రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు కొన్నాక.. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ.60వేలిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ.50 వేలు ఇచ్చారు. ఇలా పలువురు కాంగ్రెస్ నేతలు అందించిన నగదును రైతుల కుటుంబాలకు అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ దమ్మున్న మగాడు.. ఆ వెధవల్ని చె.. కొట్టండి.. శ్రీరెడ్డి వ్యవహారం?: నాగబాబు