Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ వధువుకు మత్తుమందిచ్చి... రోజుకు పది మంది చొప్పున అత్యాచారం..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించ

Advertiesment
నవ వధువుకు మత్తుమందిచ్చి... రోజుకు పది మంది చొప్పున అత్యాచారం..
, శనివారం, 21 జులై 2018 (10:32 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
 
హర్యానా రాష్ట్రంలోని పంచకుల జిల్లాలోని మోర్నీ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతికికి ఇటీవల వివాహమైంది. ఆ తర్వాత ఆమె భర్తకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి మీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అతని వెంట భార్యను పంపించాడు. ఆమెను నాలుగు రోజుల పాటు బంధించి, మత్తుమందులిచ్చి 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
దీనిపై ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గెస్ట్‌లో ఉన్న బాధిత యువతిని రక్షించారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు వెళ్లిన ఆమె, బుధవారం 18 వరకూ తిరిగి రాలేదు. ఆమెను నాలుగు రోజుల పాటు అక్కడే బంధించారు. మత్తుమందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. రోజుకు 10 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరల్ అయినా రాహుల్ కౌగిలింత.. సోనమ్ ఫన్నీ కామెంట్..!!