Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై అత్యాచారం.. తలనరికేశారు.. నిందితులను ప్రజలు ఏం చేశారంటే?

అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్

బాలికపై అత్యాచారం.. తలనరికేశారు.. నిందితులను ప్రజలు ఏం చేశారంటే?
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:35 IST)
అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజలే అత్యాచార నిందితులకు శిక్ష విధించారు.

ఇద్దరు అత్యాచార నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వుంచగా.. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో వున్న ప్రజలు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని లాకప్‌ నుంచి బయటికి లాక్కొచ్చి చంపేశారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌ లోహిత్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తేయాకు తోటలో పనిచేసే సంజయ్ సోబోర్ (30), జగదీష్ లోహార్ (25)లు ఈ నెల 12వ తేదీన ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా చిన్నారి తలను నరికేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాప మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు విచారణలో సంజయ్, జగదీష్‌లే నిందితులని తేలింది. 
 
పోలీసులు నిందితులు లాకప్‌లో వుంచారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. నిందితులను లాకప్ నుంచి వెలుపలికి లాక్కెళ్లి కొట్టి చంపారు. ఈ ఘటనపై నిరసనకారులను అదుపు చేయలేకపోయిన ముగ్గురు పోలీసులను సస్పండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవిశ్వాసంలో హైడ్రామా... ఎలాగో తెలుసా..?