Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాల

Advertiesment
Madhya Pradesh
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:21 IST)
మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే మైనర్ బాలిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో.. ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. 
 
ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 50 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఎస్పీ సునీతా రెడ్డి అక్రమ సంబంధం కేసు... యాంకర్ సోదరుడితో తొలిగా...