Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుణే మహిళపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు... అదే మంటల్లో కాలిపోయాడు..

fire
, బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:23 IST)
పుణే మహిళ ఉద్యోగిపై వేటు వేసింది. అదే ఆమె ప్రాణాలను హరించింది. ఉద్యోగం నుంచి తొలగించిందనే ఆగ్రహంతో ఆ వ్యక్తి  ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ ఘటనలో యజమానితో పాటు ఉద్యోగి కూడా నిప్పంటుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పూణేలోని సోమనాథ్ నగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో వీరికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయాలకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. 
 
35 ఏళ్ల ఓ వ్యక్తి తన మాజీ యజమాని అయిన మహిళకు నిప్పంటించాడని, ఇద్దరూ కాలిన గాయాలతో మంగళవారం మరణించారని పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు మిలింద్ నాథ్‌సాగర్.. బాలా జానింగ్‌కు చెందిన టైలరింగ్ షాపులో పనిచేసేవాడు. ఆమె ఎనిమిది రోజుల క్రితం అతనిని తొలగించింది. దీంతో ఆగ్రహించిన మిలింద్ గత రాత్రి 11 గంటల ప్రాంతంలో షాపుకు వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ జాదవ్ తెలిపారు.
 
కాలిన గాయాలతో చికిత్స పొందుతూ వచ్చిన మిలింద్ నాథ్‌సాగర్ మంగళవారం మరణించాడు. ఇక మొబైల్ దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి మిలింద్‌తో పాటు అతని యజమానురాలిని కాపాడే క్రమంలో
 
సమీపంలో మొబైల్ దుకాణం నడుపుతున్న ఒక వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 35శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వండి : ప్రశాంత్ కిషోర్