Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించిన ప్రధాని మోడీ

యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించిన ప్రధాని మోడీ
, ఆదివారం, 5 జులై 2020 (10:39 IST)
చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో స్వదేశీ యాప్‌ల కోసం నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చింగారీ యాప్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దేశీయంగా యాప్‌ల రూపకల్పన, అభివృద్ధి అంశాల్లో ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించింది.
 
ఈ ఛాలెంజ్ రెండు రకాలుగా ఉంటుంది. ట్రాక్-1, ట్రాక్-2 అంటూ విభజించారు. ఇప్పటికే దేశీయంగా వాడుకలో ఉన్న యాప్‌ల కోసం ట్రాక్-1, దేశంలో కొత్త యాప్‌లు రూపొందించగల సత్తా ఉన్న ఔత్సాహికుల కోసం ట్రాక్-2 చాలెంజ్‌ను ప్రకటించారు. 
 
వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ మీడియా, ఈ-లెర్నింగ్, క్రీడలు, వార్తలు, ఆర్థిక సాంకేతికత, అగ్రిటెక్, హెల్త్, వినోదం, ఆఫీస్ ప్రొడక్టివిటి అంశాల్లో యాప్‌లు రూపొందించాల్సి ఉంటుంది.
 
ట్రాక్-1, ట్రాక్-2 రెండు విభాగాల్లో మూడేసి బహుమతులు ఇవ్వనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ.20 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ.15 లక్షలు, మూడో బహుమతి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇతర విభాగాల్లోనూ మరికొన్ని బహుమతులు ఉన్నాయి. 
 
నీతి ఆయోగ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఈ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. జూలై 4 నుంచి ఈ ఛాలెంజ్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18 లోపు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారు వ్యాపారి బర్త్‌డే పార్టీ.. హాజరైన ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్!!