Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

Advertiesment
death

ఠాగూర్

, బుధవారం, 28 మే 2025 (18:23 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని భోపాల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్టులో ఎనిమిదేళ్ల బాలుడు చిక్కుకునిపోయాడు. కరెంట్ పోవడంతో లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ చిన్నారి మధ్యలో చిక్కుకునిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి బిడ్డకు ఏమైందోనని తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో తండ్రికి గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
భోపాల్‌లోని జత్కేడీ ప్రాంతలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో రిషిరాజ్ భట్నాగర్ (51) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులో కలిసి ఉంటున్నారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన తన ఎనిమిదేళ్ల కుమారుడు కోసం వెతుక్కుంటూ అపార్టుమెంట్ కిందికి దిగాడు. అక్కడ కుమారుడు కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పగా, ఆ బాలుడు ఇంటికి వెళ్లేందుకు ఎలివేటర్ ఎక్కగా ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దీంతో లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. 
 
తన కుమారుడు లిఫ్టులో ఇరుక్కునిపోయాడని తెలియగానే రిషిరాజ్‌ ఒకింత షాక్‍‌కు గురై, వెంటనే కుప్పకూలిపోయిగా, వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు, విద్యుత్ సరఫరా కేవలం మూడు నిమిషాల్లోనే రావడంతో లిఫ్టులో ఉన్న బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ, కొన్ని నిమిషాల వ్యవధిలో జరగకూడని ఘోరం జరిగిపోయింది. కళ్లముందే కుటుంబ యజమాని కుప్పకూలిపోయి తుదిశ్వాస విడవడం ఆ కుటుంంబంలో తీవ్ర విషాదాన్ని గురిచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు