Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరేళ్ల బాలికపై ఎస్సై అత్యాచారం.. రాజస్థాన్‌లో దారుణం

Advertiesment
Rape
, శనివారం, 11 నవంబరు 2023 (09:48 IST)
రాజస్థాన్‌లో ఆరేళ్ల బాలికపై ఎస్సై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... దౌసా జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై స్థానిక ఎస్సై దారుణానికి పాల్పడ్డాడు. 
 
సబ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని తన గదికి తీసుకొచ్చి.. ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయ్యింది. ఈ ఘటనపై నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
 
మరోవైపు, స్థానికులు ఘటనపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానిక రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి నిందితుడికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. 
 
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం చూసి పోలీసులు పేట్రేగిపోతున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడీ లాల్ మీనా ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట నిజమే: ధర్మాన