Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల కానిస్టేబుల్ అత్యాచార యత్నం

ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల కానిస్టేబుల్ స్థానికంగా నివశిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే... గౌతమ్ బుధ్ నగర్‌లో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుభాష్ సింగ్ అనే కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని సురజ్‌పూర్‌లో బు

ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల కానిస్టేబుల్ అత్యాచార యత్నం
, శుక్రవారం, 12 జనవరి 2018 (20:04 IST)
ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల కానిస్టేబుల్ స్థానికంగా నివశిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే... గౌతమ్ బుధ్ నగర్‌లో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుభాష్ సింగ్ అనే కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని సురజ్‌పూర్‌లో బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు, నేరస్తుడు ప్రక్కప్రక్కన భవనాలలో నివశిస్తున్నారు. బాలిక తల్లి ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేస్తోంది.
 
బాలికను అతను అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా తీసుకెళ్లాడని, అప్పుడు ఆమె అరుపులు చుట్టుప్రక్కల వారికి వినిపించాయని, స్థానికులు బాలికను రక్షించి అతడిని ముట్టడించే లోపల నిందితుడు పారిపోయాడు. అతను 4 గంటలకు తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు ఆడవాళ్లు అలారం మోగించారు. స్థానికులు ప్రతిస్పందించి అతనిపై బూట్లు, చెప్పులు విసిరారు. తదుపరి పోలీసులకు అప్పగించారు.
 
బాలికను అతడు అరగంట సేపు నిర్భందించాడని సమాచారం. నిందితునిపై POCSO చట్టం క్రింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నోయిడాలో సెక్టార్ 30 జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధరామయ్యా... ఇదేం పనయ్యా? అమ్మాయి చేయి పట్టుకుని లాగుతూ...