Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

Advertiesment
narendra modi

ఠాగూర్

, మంగళవారం, 13 మే 2025 (14:23 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానికస్థావరం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడమే. ఆయన మంగళవారం ఈ వైమానిక స్థావరానికి వెళ్లి గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు, సైనికులతో ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ బలగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్కడే ఓ గంట పాటు ఉన్నారు 
 
గత ఏప్రిల్ నెల 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిగా మే 7వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఆ తర్వాత మే 9, 10వ తేదీల్లో పాకిస్థాన్‌ దాడికి యత్నించిన వైమానిక స్థావరాల్లో ఆదంపూర్ ఒకటి కావడం గమనార్హం. ఈ పర్యటన ద్వారా సైనికుల ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రధాని కొనియాడారు. భారత్ మాతాకీ జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసివున్న ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మా సైనికులను చంపేసింది : మృతుల పేర్లను వెల్లడించిన పాకిస్థాన్