Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత బట్టలు పెట్టారని ఆగ్రహంతో ఇలా చేశారు..

Advertiesment
pidari
, గురువారం, 20 జూన్ 2019 (10:20 IST)
పాత బట్టలు పెట్టారనే ఆగ్రహంతో ఓ వధువు, గంటల వ్యవధిలోనే విడాకులు తీసుకున్న ఘటన జార్ఖండ్‌లోని పిడారీ గ్రామంలో చోటుచేసుకుంది. పాత బట్టలు పెట్టిన వరుడి తరఫువారిలో 150 మందిని వధువు బంధువులు బంధించగా, స్థానిక మంత్రి స్వయంగా కల్పించుకుని పంచాయితీ చేసి, సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. పిడారీ గ్రామానికి చెందిన నౌషద్ అన్సారీ కుమార్తెకు ఖుర్షిద్ అన్సారీ కుమారుడు ఆరీఫ్ అన్సారీతో పెద్దలు పెళ్లిని నిశ్చయించారు. పెళ్లికి ముందే కట్న కానుకల కింద రూ. 3 లక్షలకు పైగా వధువు తరపువారు మగపెళ్లివారికి అందించారు. 
 
ముందుగా అనుకున్న విధంగానే నిఖా పూర్తయ్యింది. సంప్రదాయం ప్రకారం, వరుడి తరఫున వధువుకు దుస్తులను ఇవ్వగా, అవి పాతవని, వాడేసినవి తమకు ఇచ్చారని వధువు తరఫు బంధుమిత్రులు గొడవకు దిగారు. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఇంకా వధువు తరఫువారు వరుడి బంధువులను బంధించడంతో, స్థానిక ఎమ్మెల్యే, ఆ ప్రాంత మంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు మహిళ పనిమనిషిగా వెళ్లి.. సె* బానిసగా తిరిగొచ్చింది..