Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయక చవితి రోజు నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు

new Parliament
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (15:52 IST)
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రారంభ సమావేశాలు మాత్రం అంటే 18వ తేదీన జరిగే సమావేశంలో పాత భవనంలో ప్రారంభించి, ఆ తర్వాత రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించనున్నారు. 
 
మరోవైపు, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను బహిర్గతం చేయాలంటూ విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 
 
'సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నారు" అని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 
 
మన దేశంలో పార్లమెంటు "ప్రత్యేక సమావేశాలు" చాలా అరుదుగా జరుగుతుంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తిచేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న "అమృత్‌ కాలం"లో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్లు ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ క్షణమైనా నన్ను అరెస్టు చేయొచ్చు : చంద్రబాబు నాయుడు