Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీఎం పళనిస్వామికి హైకోర్టులో ఊరట... ఓపీఎస్‌కు చుక్కెదురు

Advertiesment
edappadi k palaniswamy
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:07 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. జూలై 11వ తేదీన ఆయన సారథ్యంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తేల్చి చెప్పింది. పైగా, ఈ అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జూలై 11వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నేతలంతా కలిసి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే, ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పార్టీ కన్వీనర్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సింగల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదన తీర్పునిచ్చింది. 
 
దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పళనిస్వామి హైకోర్టు బెంచ్‌లో అప్పీల్ చేసారు. ఈ అప్పీల్ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మరోవైపు, హైకోర్టు తీర్పును వెలువరించగానే ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కల్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారు : ఆర్ఆర్ఆర్