పాకిస్థాన్తో యుద్ధానికి సిద్ధం కావాలి : సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ 100 సార్లు క
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
పాక్ ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం ఎప్పుడైనా కూల్చివేసి, పాలనను తమ అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. సరిహద్దులో నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, కాల్పులు జరుపుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని... వీటిని మనం యుద్ధ సంకేతాలుగా భావించవచ్చని తెలిపారు.
జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఆదివారం జరిపిన పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ రోజు అదే జిల్లాలోని మెంధర్లో పాకిస్థాన్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతున్నారు. పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఎదురు కాల్పులు జరుపుతూ పాక్ రేంజర్ల చర్యలను ఎదుర్కొంటోంది. కాల్పుల్లో భారత జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదు. పాక్ రేంజర్లకు జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.