చిట్టి చిలుకను తెచ్చి పెంచుకున్నారు. అది ముద్దుముద్దుగా పలుకుతూ ఎంతో ఆనందాన్నిస్తోంది. ఐతే అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. దీనితో మీరట్లోని షాపీర్ ప్రాంతంలోని ఒక కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అర్షద్, అతని 52 మంది ఉమ్మడి కుటుంబ సభ్యులు గత పది రోజులుగా ప్రశాంతంగా నిద్రపోవడంలేదు. ఇంట్లో వాతావరణం పూర్తిగా దిగులుగా ఉంది. కారణం వారి ప్రియమైన చిలుక కిట్టు కనిపించడంలేదు. అది ఇప్పుడు వారి నుండి తప్పిపోయింది. కిట్టు ఆచూకి చెబితే 5,000 రూపాయల నగదు బహుమతిని ఇస్తానని చెప్పాడు.
మూడు సంవత్సరాల క్రితం, ఒక చిన్న చిలుక అకస్మాత్తుగా వారి ప్రాంగణంలో కనిపించిందని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో దాని శరీరంపై కనీసం ఈకలు కూడా లేవు. ఎగరలేకపోయింది. అర్షద్ అతని కుటుంబం చిలుకను తమ సొంత బిడ్డలా పెంచి దానికి కిట్టు అని పేరు పెట్టారు. అది కేవలం పక్షి మాత్రమే కాదు, కుటుంబంలో ఒక భాగంగా మారింది. అందరితో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేయడం, పిల్లలతో ఆడుకోవడం, ఇంటి బయట నడకకు వెళ్లడం, ప్రతిదానిలో పాల్గొనడం కిట్టుకు అలవాటుగా మారింది.
సెప్టెంబర్ 27న కిట్టు ఎప్పటిలాగే ఇంట్లో అందరితో ఆడుకుంటున్నాడు, కానీ ఆ రోజు అకస్మాత్తుగా ఎగిరిపోయింది, కానీ ఇక తిరిగి రాలేదు. అర్షద్ ఇలా వివరించాడు, ఇంతకుముందు ఎప్పుడూ ఆ చిలుక ఎగిరిపోలేదు. ఆ రోజు ఏమి జరిగిందో మాకు తెలియదు. చుట్టుపక్కల ప్రాంతాలను వెతికాము, కానీ జాడ దొరకలేదు. కిట్టు ఎగిరిపోయిన తర్వాత, ఇంట్లో దుఃఖం వ్యాపించింది. అందరూ కలత చెందారు, పిల్లలు అన్నం తినడం కూడా మానేశారు. ఎవరైనా అతని పేరు ప్రస్తావించినప్పుడల్లా, అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. కిట్టు మా కుటుంబానికి ప్రాణం. అది లేకుండా ఏమీ బాగా లేదు, ఇల్లు అసంపూర్ణంగా అనిపిస్తుంది. కిట్టు జ్ఞాపకాలు మా ఇంట్లో రోజంతా తిరుగుతున్నాయి.
కిట్టు ఆచూకి ఎవరికైనా చెబితే వారికి 5,000 రూపాయల బహుమతి ఇస్తానంటున్నాడు అర్షద్. కిట్టును తిరిగి పొందడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు అని అతను చెప్పాడు.