Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

vote
, ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (16:33 IST)
దేశంలో వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో కలిపి 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగారూ 9,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే అంచనా వేసింది. 
 
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల అనంతరం తిరిగి వాటిని భద్రపరిచేందుకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 2015లోనే న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బందిశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన నివేదికలో ఎన్నికల సంఘం ఈ అంశాలను ప్రస్తావించింది.
 
అయితే, ఇపుడు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఎన్నికల ఖర్చు అంశంపైనా దృష్టిపెట్టనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోనే నివేదిక సమర్పించే అవకాశాలు లేవు. ఒకవేళ సమర్పించినా ఐదు రాజ్యాంగ సవరణలు చేయడం, సగం రాష్ట్రాల ఆమోదం పొందడం అంత సులువైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఈసారి పాక్షిక జమిలి ఎన్నికలు నిర్వహించాలని, లోక్‌సభతో 10-12 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాకు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్