Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం

train
, గురువారం, 23 నవంబరు 2023 (13:58 IST)
ఒరిస్సా కటక్‌కు సమీపంలో ఉన్న సుందర్ గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు వచ్చాయి. ఈ ఘటన రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వందే భారత్ రైలుతో సహా మొత్తం మూడు రైళ్ళు వచ్చాయ. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
సంబల్‌పూర్ - రూర్కెలా మెమొ రైలు, రూర్కెల్ - ఝార్సుగూడ పాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైనులు ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరి - రూర్కెలా మధ్య నడిచే వదే భారత్ రైలు కూడా ఇదే ట్రాక్‌పై వచ్చింది. అయితే, మెమొ, పాసింజర్ రైళ్ళు ఎదురెదురుగా వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా రైల్వేస్టేషన్‌కు కేవలం 200 మీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో దారుణం : కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం