Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎనిమిదో తరగతి బాలికపై హెడ్మాస్టర్ అత్యాచారం...

Advertiesment
Odisha
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:16 IST)
ఒడిషా రాష్ట్రంలో వినాయక చవితి రోజున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. పాఠాలు చెప్పాల్సిన బడి పంతులే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పైగా, ఆయనో స్కూలు హెడ్మాస్టర్. బాధిత బాలిక అతనివద్ద ఎనిమిదో తరగతి చదువుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా రాష్ట్రంలోని బుధ్‌ఘడ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేశారు. 
 
ఈ పూజలో పాల్గొనేందుకు వచ్చిన బాలికల్లో ఎనిమిదో తరగతి చదివే ఓ బాలిక కూడా ఉంది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ మైనర్ బాలికను హెడ్మాస్టర్ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ లైంగిక దాడి ఘటనను ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్మాస్టర్ పరారీలో ఉన్నాడు. బాలికను లైంగికంగా వేధించిన హెడ్మాస్టరుపై పోస్కో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న హెడ్మాస్టర్ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలిసినోడే కదా అని బైకు ఎక్కిన మహిళ... ఆ తర్వాత...