Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

NEET 2023: నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 06 చివరి తేదీ

neet exam
, మంగళవారం, 7 మార్చి 2023 (10:35 IST)
జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్టుల్లో అత్యంత కఠినమైనదిగా నీట్‌ని భావిస్తారు. ఇందులో క్వాలిఫై అవ్వాలంటే విద్యార్థులు చాలా శ్రమించాలి. దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి నీట్‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా నీట్-2023 యూజీ నోటిఫికేషన్ విడుదలైంది. మే 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 06,2023గా నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. 
 
నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. నీట్‌ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. 
 
ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవీన్ హత్య కేసు మరో ట్విస్ట్.. ప్రేమ వ్యవహారమే కారణమట!