Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?

Advertiesment
ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?
, బుధవారం, 26 డిశెంబరు 2018 (14:27 IST)
ముంబై రైల్వే స్టేషన్‌లోనే ఓ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పోలీసులే ఆ మహిళ కోసం లేబర్ రూమ్ సిద్ధం చేశారు. ఎలాగంటే..? 21 ఏళ్ల మహిళ ఎప్పుడూ బిజీ బిజీగా ముంబై రైల్వేస్టేషన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చింది. గీత దీపక్ వాఘ్రే ఆమె భర్త దాదర్ స్టేషన్‌లో పూణే వెళ్లేందుకు గాను వేచి వున్నారు. ఆ సమయంలో గీతకు పురిటి నొప్పులు వచ్చాయి. 
 
ఇక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు.. ప్రయాణీకులు బెడ్ షీట్లతో లేబర్ రూమ్‌లా నాలుగు వైపులా అడ్డుకట్టారు. భార్య వద్దే భర్త కూర్చుండి పోయాడు. కొందరు మహిళలు గీతకు ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రసవం చూశారు. 
 
ఈ క్రమంలో గీతకు పండంటి పాప పుట్టింది. కాన్పు జరగగానే పోలీసులు మహిళను, శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా వున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల మహిళ భుసవాల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌లోనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 30 ఏళ్ల మహిళ జూలైలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కవల పిల్లలకు రైలులోనే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్‌వేర్ టెక్కీ...