Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యు ఆర్ ది బాంబర్ అంటూ ప్రియురాలు చాటింగ్.. 6 గంటలు నిలిచిపోయిన ఫ్లైట్

indigo flight
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:57 IST)
ఓ విమానం ఏకంగా ఆరు గంటల పాటు నిలిచిపోయింది. ఆ విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు తన ప్రియురాలితో చాటింగ్ మొదలుపెట్టాడు. ఈ చాటింగ్‌లో ప్రియురాలు.. తన ప్రియుడిని ఉద్దేశించి "యు ఆర్ ది బాంబర్" అంటూ టెక్స్ట్ పంపింది. దాన్ని పక్కసీటులోని ప్రయాణికుడు చూసి విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంత అప్రమత్తమైన సిబ్బంది.. విమాన ప్రయాణికులందర్నీ కిందికి దించేసి విమానాన్ని నిశితంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రియురాలు, తాను ఫ్రెండ్లీ చాటింగ్ చేసుకుంటున్నామని ప్రయాణికుడు చెప్పాడు. మొత్తంగా ఆరు గంటల ఆలస్యం తర్వాత విమానం గమ్యస్థానానికి బయలుదేరింది. మంగుళూరు నుంచి ముంబైకు వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. 
 
అందులో 'యు ఆర్ ద బాంబర్' అన్న మెసేజ్ కనిపించింది. అంతే వెంటనే కీడు శంకించిన ఆమె విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది. 
 
ఆ తర్వాత విమానంలోని 185 మంది ప్రయాణికులను కిందికి దించేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరోవైపు, చాటింగ్ చేసిన యువకుడిని, అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. వారి సంభాషణ సరదాగా సాగిందని తేలడంతో విమానం బయలుదేరేందుకు అధికారులు అనుమతినిచ్చారు. 
 
దాదాపు ఆరుగంటలపాటు నిలిచిపోయిన విమానం చివరికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే, విచారణ జరుగుతున్న నేపథ్యంలో యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు, అలాగే అతడి ప్రియురాలు కూడా బెంగళూరు వెళ్లే విమానాన్ని మిస్సైంది. కాగా, వారిద్దరి మధ్య జరిగింది ఫ్రెండ్లీ చాటింగేనని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి