Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపిన యువతి.. కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఎలా?

Advertiesment
Mumbai
, బుధవారం, 8 జులై 2020 (10:41 IST)
దేశంలో మహిళలపై వేధింపులు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఫేస్‌బుక్ వేదికగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ముంబైలోని అగ్రిపాడాకు చెందిన ఓ 13ఏళ్ల బాలిక ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపేది. ఈ క్రమంలోనే ఓ యువకుడి (22)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 
 
అయితే సదరు యువకుడు ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి రాజస్థాన్‌ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే జూలై ఒకటో తేదీన సదరు బాలిక కనపడకపోవడంతో పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించారు. 
 
దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు రాజస్థాన్‌లోని జల్వాడ్, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు వెళ్లి అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 13 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో యువకుడు మృతి... రూ.12 లక్షలు బిల్లు వేసిన ప్రైవేటు ఆస్పత్రి!!