Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నకొడుకునే పెళ్లి చేసుకుంది.. ఎక్కడ?

marriage
, గురువారం, 19 మే 2022 (08:45 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోతున్నారు. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. అనంతరం అతడు వదిలేయడంతో ఇంద్రరామ్‌ను రెండో వివాహం చేసుకుంది.
 
ఇంద్రరామ్‌, బబ్లీ సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కొడుకు వారి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
సడన్‌గా ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉన్నదని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని.. ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుని పోయారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవనోపాధిని మెరుగుపరచడానికి అల్ట్రాటెక్ నీటి సంరక్షణ ద్వారా తనవంతు సాయం