Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ వ్యవహారం.. కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎక్కడ?

murder
, మంగళవారం, 31 అక్టోబరు 2023 (10:16 IST)
తన మనస్సుకు నచ్చిన యువకుడిని కన్నకుమార్తె ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని కన్నతల్లి.. కన్నబిడ్డను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కౌశాంబికి చెందిన ఓ మహిళకు 15 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువకుడితో ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన కన్న తల్లి ఆగ్రహానికి గురై కుమార్తెను మందలించింది. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోలేదు. తన 15 యేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపేసింది. ఆమెకు ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఆ తర్వాత మృతదేహాన్ని బావిలో పడేశారు. 
 
ఆ తర్వాత తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు మంజన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన తేజ్వాపూర్ గ్రామం వెలువల వ్యవసాయ బావిలో ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళకు చూపించగా, ఆ మృతదేహం తన కుమార్తెదేనని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మరింత లోతుగా విచారించగా, ఆ మహిళ నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ఇతర కుటుంబ సభ్యులతో పాటు మైనర్ కుమార్తెను కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కోడలు మీరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు