Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్ర

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం
, శుక్రవారం, 24 నవంబరు 2017 (12:56 IST)
పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్రకటించి యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణాలిచ్చింది. ఈ ఘటన కోల్‌కతాలోని కాశీపుర్ ప్రాంతంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో యజమాని ఇంటిలోకి చొరబడిన దొంగలపై వానరం దాడికి దిగింది. పావురాలను దొంగలించేందుకు వచ్చిన వారికి చుక్కలు చూపించింది. కాశీపూర్‌లో విక్కీ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో కొన్ని పావురాలతో పాటు ఈ వానరాన్ని కూడా పెంచుకుంటున్నాడు. 
 
కానీ పావురాలను దొంగలించేందుకు ఇంట్లోకి దొంగలు పడ్డారు. వీరిని గమనించిన వానరం వారితో పోటీపడి పావురాలను కాపాడింది. దీంతో వారు పావురాలను తీసుకెళ్లలేకపోయారు. కానీ వానరాన్ని మాత్రం దొంగలు చంపేశారు. దీంతో యజమాని కలతచెంది, ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?