తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ ఓటమి పాలైనప్పటికీ.. రాష్ట్ర శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని డీఎంకే కోశాధికారి, డీఎంకే చీఫ్ తనయుడు ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. ప్రజలు అత్యధిక స్థానాల్లో గెలిపించి తమను బలమైన ప్రతిపక్షంగా ఎన్నుకున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అతిపెద్ద ప్రతిపక్షంగా డీఎంకే వ్యహరించబోతోందన్నారు.
నిజానికి తమ పార్టీకి దక్కాల్సిన విజయాన్ని అన్నాడీఎంకే డబ్బుతో కొనుగోలు చేసిందన్నారు. ప్రారంభ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకేకు ఆధిక్యత వచ్చిందని తెలియడంతోనే పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహచించారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల అతి తక్కువ ఓట్లతో గెలిచిన స్థానాల్లో రీ కౌంటింగ్ కోరినట్టు చెప్పారు.