Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

Advertiesment
Lady victim

ఠాగూర్

, ఆదివారం, 29 జూన్ 2025 (12:32 IST)
కోల్‌కత్తా న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోవడంతో పాటు ఓ సైకోగా మారిపోయినట్టు సమాచారం. ఒకవైపు, పోలీసులు, మరోవైపు కాలేజీ యాజమాన్యం నిందితుడికి అన్ని విధాలుగా సహకరించడంతో ఆయన కిరాతకంగా ప్రవర్తించినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు జూలై ఒకటో తేదీ వరకు పోలీస్ కస్టడీ విధించారు. సీసీటీవీ ఫుటేజీ, హాకీ స్టిక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
 
ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు, జూనియర్లు ఆరోపిస్తున్నారు.
 
సౌత్ కోల్‌కతా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగి విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్లాను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారిని జులై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. 
 
అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 
'అతను, అతని అనుచరులు అమ్మాయిల పాలిట ఉగ్రవాదుల్లా ఉండేవారు. ఈ విషయం అధికారులకు తెలిసినా అతడిని కాపాడారు. లైంగిక వేధింపులపై టీచర్-ఇన్-చార్జ్ అధికారికంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది' అని ఓ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. యూనియన్ సభ్యులకు ఏదైనా చేసే లైసెన్స్ ఉండేదని, భయంతో తాము మౌనంగా ఉండాల్సి వచ్చేదని మరో ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలి ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజ్ లభించిందని, దానిని పరిశీలిస్తున్నామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు, సెక్యూరిటీ గార్డు, బాధితురాలి కదలికలు ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయని చెప్పారు.
 
ఘటనా స్థలంలో మూడు చోట్ల పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. స్టూడెంట్స్ యూనియన్ రూమ్, వాష్‌రూమ్, గార్డు రూమ్‌లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అధికారి పేర్కొన్నారు. అక్కడ లభించిన వెంట్రుకలు, గుర్తు తెలియని ద్రవాలు ఉన్న కొన్ని బాటిళ్లు, ఒక హాకీ స్టిక్స్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్