Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21 రోజులు.. తల్లి మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచేశాడు.. చివరికి?

21 రోజులు.. తల్లి మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచేశాడు.. చివరికి?
, బుధవారం, 26 డిశెంబరు 2018 (10:52 IST)
మూఢ నమ్మకం కారణంగా ఓ యువకుడు తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే 21 రోజులు వుంచాడు. తల్లి మృతదేహంతోనే కాలం గడిపాడు. ఎవరైనా మరణించిన 21 రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే మూఢనమ్మకంలో ఓ యువకుడు తన తల్లి విషయంలో అదే చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు పట్టుబడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకున్నాడు. తల్లి కృష్ణ (77)తో కలసివుంటున్న మైత్రేయ 18 రోజుల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా మైత్రేయ అలానే వుంచాడు. 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచాలని చూశాడు. 
 
అలా 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలని అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైళ్లల్లో కర్పూరం వెలిగించకండి.. ఘోర అగ్ని ప్రమాదాలు తప్పవు.. రైల్వే శాఖ