Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..

అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఎంతసేపటికీ ఆ యువతి ప్రతిఘటి

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..
, బుధవారం, 28 జూన్ 2017 (16:06 IST)
అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఎంతసేపటికీ ఆ యువతి ప్రతిఘటించడంతో పాటు బిగ్గరగా కేకలు పెట్టడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. అంతే  యువతిని నిప్పుకు ఆహుతి చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని షాహిగణేష్‌పూర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. అదే ప్రాంతానికి చెందిన యువకుడు సెల్ ఫోన్ ఛార్జ్ కోసమంటూ వెళ్లాడు. ఆ యువతి కూడా అతనిని నమ్మి సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న యువకుడు ఇంట్లోకి ప్రవేశించి.. తలుపులేసుకున్నాడు. ఆపై ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి గురైన యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. యువతి కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స ఫలించక యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ కడుపులో పండు పెట్టుకుని మోదీని ఆలింగనం చేసుకున్నారు... నారాయణ(వీడియో)