Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సువేందు ఎన్నిక చెల్లదంటూ కోర్టుకెక్కిన మమతా బెనర్జీ

సువేందు ఎన్నిక చెల్లదంటూ కోర్టుకెక్కిన మమతా బెనర్జీ
, శుక్రవారం, 18 జూన్ 2021 (11:02 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోర్టు కెక్కారు. ముగిసిన ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో తనపై విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇటీవల ముగిసిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ దీదీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్‌ కౌంటింగ్‌ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు.
 
దీనిపై మమతా బెనర్జీ అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్‌ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్‌ డౌన్‌ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. 
 
తాను గెలుపొందానని.. దానికి గవర్నర్‌ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌తో జాగ్రత్త: తెలంగాణ సర్కారు వార్నింగ్