Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్‌పై తగ్గేదే లేదు: సుప్రీంను ఆశ్రయించిన మమత

ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.

ఆధార్‌పై తగ్గేదే లేదు: సుప్రీంను ఆశ్రయించిన మమత
, శనివారం, 28 అక్టోబరు 2017 (07:28 IST)
ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.
 
మొబైల్‌, సిమ్‌ కార్డుల కనెక్షన్లకు ఆధార్‌ కార్డు లింకును తప్పని సరిచేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సోమవారం కోర్టు విచారించనుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్రం ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించిన దరిమిలా ఈ దావాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది.
 
కాగా, ఇటీవల మమతా బెనర్జీ మాట్లాడుతూ... ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆధార్‌ కార్డు వివరాలను టెలికాం కంపెనీలకు ఇవ్వబోన్న ఆమె ప్రకటించిన విషయం తెల్సిందే. ‘అవసరమనుకుంటే నా మొబైల్‌ కనెక్షన్‌ రద్దు చేయండి’ అని గత వారం కేంద్రానికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా కేంద్రం ‘ఆధార్‌ లింకు’ ఆదేశాలు జారీ చేసిందని ఆమె మొదటి నుంచీ వాదిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ క్రెడిట్ అంతా రాజమౌళిదే : సీఎం చంద్రబాబు