Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీసుల్లో వ్యక్తిగత అవసరాలకు కూడా మొబైల్ వినియోగించరాదు : మద్రాసు హైకోర్టు

ఆఫీసుల్లో వ్యక్తిగత అవసరాలకు కూడా మొబైల్ వినియోగించరాదు : మద్రాసు హైకోర్టు
, మంగళవారం, 15 మార్చి 2022 (15:43 IST)
ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ వినియోగంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆఫీసుల్లో మొబైల్ ఫోన్ వినియోగించరాదంటూ ఆదేశించింది. అందుకు తగిన విధంగా విధి విధానాలు రూపకల్పన చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అదేసమయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచన చేసింది. 
 
తిరుచ్చికి చెందిన హెల్త్ రీజినల్ వర్క్ విభాగంలో సూపరింటెండెట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి విధి నిర్వహణలో ఉండగానే ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియో తీశాడు. ఉద్యోగులు ఎంతగా వారించినా కూడా సదరు అధికారి వినిపించుకోలేదు. దీంతో ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు ఆ అధికారిని సస్పెండ్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించరాదంటూ సంచలన తీర్పును వెలువరించింది. ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాలకు కూడా మొబైల్ ఫోన్ వినియోగించరాదని స్పష్టం చేసింది. 
 
ఈ తరహా నిషేధానికి సంబంధించిన విధి విధానాలను రూపొదించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, ప్రభుత్వం రూపొందించే సదరు నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే.. వారికి అనుమతి లేదు