Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే వేదికపై భార్యను - ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న భర్త...

ఒకే వేదికపై భార్యను - ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న భర్త...
, బుధవారం, 11 డిశెంబరు 2019 (14:56 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భింద్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకే వేదికపై భార్యను, ఆమె చెల్లిని పెళ్ళి చేసుకున్నాడో వ్యక్తి. అతని పేరు పరిహార్. వయసు 35 యేళ్లు. కట్టుకున్న భార్య సమ్మతితో ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే వేదికపై తన భార్యకు కూడా మరోమారు మెడలో మూడుముళ్లు వేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భింద్‌ జిల్లాలోని గుడవాలి గ్రామానికి చెందిన దీపు పరిహార్‌(35), వినీత(28) అనే దంపతులు ఉన్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నాడు. అలాగే వినీత కూడా గుడవాలి గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతోంది. 
 
ఈ క్రమంలో పిల్లలను బాధ్యతగా చూసుకునేందుకు వినీతకు కష్టమైంది. పైగా, ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో భార్యను, పిల్లల పోషణ పరిహార్‌కు కష్టమైంది. తన బాధను భార్య వినీతకు వివహించిన పరిహార్.. రెండో పెళ్లి చేసుకుంటానని కోరాడు.
 
దీనికి వినీత సమ్మతించడంతో ఆమెకు చెల్లి వరుస అయిన రచన(22)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం గత నెల 26వ తేదీన జరిగింది. ఆ తర్వాత ఇదే వేదికపై భార్య వినీతకు కూడా మరోమారు తాళికట్టి పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా పరిహార్‌ మాట్లాడుతూ.. వినీత సమ్మతితోనే రచనను తాను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలి-సత్తెనపల్లి తెదేపా నేతలు