Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ప్రేయసీప్రియులు, హోటల్‌కెళ్లి ఎంజాయ్ చేసేందుకే...

Advertiesment
Lovers
, శనివారం, 6 మార్చి 2021 (15:37 IST)
మూడేళ్ల చిన్నారిని ప్రేయసీప్రియులు కిడ్నాప్ చేసారు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి కారణం విని పోలీసులు విస్తుపోయారు. తాము హోటల్ గదికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకే ఆ బాలికను కిడ్నాప్ చేశామనీ, అక్కడ తాము ఆ చిన్నారికి అమ్మా-నాన్న అని చెబితే హోటల్ గది సుళువుగా దొరుకుతుందనీ, తమ ఎంజాయ్మెంట్‌కి ఢోకా వుండదన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేసినట్లు చెప్పారు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లోని ప్రాంతం నుంచి కిడ్నాప్ చేసిన మూడేళ్ల బాలికను పంజాబ్‌లోని జలంధర్ నుంచి రక్షించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసులో చిన్నారి మేనత్త, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
 
చిన్నారి బాలిక అత్త నిషు ద్వివేది (20) మంగళవారం చిన్నారిని కిడ్నాప్ చేసి పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్న తన ప్రియుడి వద్దకు వెళ్లిందని ఫతేపూర్ పోలీస్ సూపరింటెండెంట్ సత్పాల్ ఆంటిల్ తెలిపారు. పోలీసు నిఘా బృందం శుక్రవారం జలంధర్‌కు చేరుకుని కిడ్నాప్ చేసిన బాలికను సురక్షితంగా రక్షించిందని తెలిపారు.
 
నిషు, ఆమె ప్రియుడు నవదీప్ సింగ్ అలియాస్ గిన్ని(25)ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. విచారణ సమయంలో, నిషూ తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయిందని, చిన్నారిని తనతో పాటు తీసుకువెళ్ళానని, తద్వారా తను, తన ప్రియుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భార్యాభర్తలుగా ఒక హోటల్‌లో ఉండవచ్చనన్న ఉద్దేశ్యంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. చిన్నారికి హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని ఆమె అన్నారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ తోనే అభివృద్ధి సాధ్యం: రోడ్ షోలో హాస్యనటుడు అలీ