Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాకే లూప్ లైన్‌లోకి వెళ్లింది... లోకో పైలెట్ గుణనిధి మొహంతి

train tragedy
, సోమవారం, 5 జూన్ 2023 (16:18 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్ గుణనిధి మొహంతి చివరిగా చెప్పిన మాటలు ఇపుడు కీలకంగా మారాయి. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అపుడే లూప్ లైనులోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. కానీ, లూప్‌లైనులో గూడ్సు రైలు ఆగివుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. లోకో పైలెట్ మహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, ఆయన  చివరి మాటలు ఇపుడు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్సు రైలును ఢీకొట్టినట్టుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ, ఈ ఎక్స్‌ప్రెస్ రైలు‌కు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే లూప్ లైనులోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ కాలేదని లోకే పైలెట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో లోకో పైలెట్ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వడోదరలో 950 ఏళ్ల నాటి వారసత్వ వృక్షాన్ని చూశారా? ఈ చెట్టు విశిష్టత ఏమిటి?